ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం జరిగింది. హాథ్రస్ హత్యాచార ఘటన మరవక ముందే అలాంటి ఘటనే గురువారం వెలుగులోకి వచ్చింది. బల్రామ్పూర్ జిల్లాలోని గైన్సారీ గ్రామానికి చెందిన మహిళపై మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెపై దాడిచేసి గాయపరిచారు. తీవ్ర గాయాలతో బాధితురాలు చనిపోయారు. మంగళవారం ఈ దారుణం జరిగింది. బీకామ్ రెండో సంవత్సరం చదువుతున్న ఆమె (22) ఫీజు చెల్లించేందుకు కాలేజీకి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా దుండగులు ఆమెను అపహరించి కారులో తీసుకెళ్లారు. ఆమెకు ఇంజక్షన్ […]
Category: News
గంటా వారసుడు వైసీపీలోకి…
టీడీపీ ఎమ్మెల్యేలను కాకుండా వారి వారసులను వైసీపీలో చేర్చుకునే ప్రక్రియ కొనసాగుతోంది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (విశాఖ ఉత్తర) కుమారుడు రవితేజ.. తన తండ్రి సమక్షంలోనే శనివారం వైసీపీలో చేరనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రవితేజకు సీఎం జగన్మోహన్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. కాగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల గంటాపై ట్విటర్లో ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు హయాంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి జరిగిందని.. దానికి మూల్యం చెల్లించుకుంటారని పేర్కొన్నారు. […]
గంటాకు భారి అఫర్ ఇచ్చిన జగన్..?
రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలో పట్టు కోసం అధికార పార్టీ వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా.. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ రంగం సిద్ధం చేసుకుంది. అక్టోబర్ 3న సీఎం జగన్తో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ కానున్నట్లు తెలిసింది. అదే రోజు.. జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అందరికంటే ముందుగా వైసీపీ […]
కారును పొలీసులు అపడంతో, రాహుల్ ఎం చెసాడంటే..!
హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి బయల్దేరిన కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకను పోలీసులు యమునా ఎక్స్ప్రెస్ హైవే దగ్గర అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచే నడక ప్రారంభించారు. రాహుల్, ప్రియాంకను అనుసరిస్తూ కార్యకర్తలు కూడా నడక ప్రారంభించారు. దీంతో స్థానికంగా కాస్త ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రాహుల్, ప్రియాంక ఉదయం 10 జన్పథ్ నుంచి బయల్దేరారు. హత్రాస్కు సరిగ్గా 142 కిలోమీటర్ల దూరంలో డీఎన్డీ ఫ్లైఓవర్ […]
అడవాళ్ళే టార్గేట్…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులకు తోడు మోసాలు కూడా మొదలయ్యాయి. జిల్లాలో కొత్తగా దొంగబాబాలు ప్రత్యక్షమయ్యారు. ‘మృత్యుదేవత తిష్టవేసింది. శాంతి హోమం చేయాలి’ అంటూ వేలాది రూపాయలు దండుకొని మాయమవుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇళ్లలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో వారం రోజులుగా ఇలాంటి మోసాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. కాషాయదుస్తులు, ముఖాన తిలకాలతో దొంగబాబాలు జిల్లాలో పలు ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. ఇంట్లో […]
ప్రైవేట్ అసుపత్రులలో జరుగుతున్న మోసాలు
పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తికి కొవిడ్ సోకింది. అతను చిన్న రైతు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే.. బెడ్లు లేవు అని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రిలో చేరదామని వెళ్లగా, అడ్మిట్ చేసుకోవాలంటే అప్పటికప్పుడు ఐదు లక్షలు కట్టాలని వైద్యులు తేల్చేశారు. ‘అంత డబ్బా!’ అని షాక్కు గురవుతుండగానే మరో పిడుగు నెత్తిన వేశారు. మొత్తం చికిత్స పూర్తయ్యేసరికి మరో రూ.తొమ్మిది లక్షలు అవుతుందని తేల్చేశారు. అంటే మొత్తం రూ.14లక్షలు అవుతుంది అని చావుకబురు చల్లగా చెప్పారన్నమాట. […]
శ్రీవారి నిలయంలో మరొక వివాదం
దుర్గగుడి ఈవో వ్యవహార సరళి రోజు రోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. ఆయనపై కోర్టుకెళుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. కార్యనిర్వహణాధికారి సురేశ్బాబు నియామకం చెల్లదంటూ ఇటీవల జనసేన నాయకుడు పోతిన వెంకట మహేష్ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. దేవదాయశాఖలో పని చేసి ఇటీవల పదవీ విరమణ పొందిన దుర్గాప్రసాద్ అనే విశ్రాంత ఉద్యోగి కూడా ఇదే అంశంపై కోర్టులో కేసు వేశారు. తాజాగా ఈవో సురేశ్బాబు, ఆయన క్యాంప్ క్లర్క్ (సీసీ) తనపై తప్పుడు […]
హైద్రాబాద్ లో చూసిన డబ్బులు ఎమయ్యాయో..?
హైదరాబాద్లో వెలుగుచూసిన రూ.1000 కోట్ల చైనా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వ్యవహారం ద్వారా ప్రధానంగా ఎవరెవరు లబ్ధి పొందారనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. పేటీఎం, హెచ్ఎ్సబీసీ బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమంగా ఎవరెవరికి నిధులు మళ్లాయి అనేది తెలుసుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపింది. చైనా జాతీయులు స్థాపించిన డాకీ పే టెక్నాలజీ, లిన్క్యున్ టెక్నాలజీ కంపెనీల ద్వారా ఈ స్కామ్ జరిగిందని వెల్లడించింది. ఈ-కామర్స్ ముసుగులో వందలాది వెబ్సైట్లను సృష్టించి, వాటి […]
విశాల్ కు షాక్ ఇచ్చిన కోర్ట్
హీరో, నిర్మాత, దర్శకుడు విశాల్కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. విశాల్, డైరెక్టర్ ఎం.ఎస్.ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘చక్ర’. ఈ చిత్రాన్ని విశాల్ ఫిలింఫ్యాక్టరీ బ్యానర్పై విశాల్ నిర్మిస్తున్నారు. దీపావళికి ఈ సినిమాను దక్షిణాది భాషల్లో ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాత విశాల్ నిర్ణయించుకున్నారు. అయితే ‘చక్ర’ సినిమా ఓటీటీ విడుదలను ఆపాలంటూ నిర్మాణ సంస్థ ట్రైడెంట్ ఆర్ట్స్ హైకోర్టులో కేసు వేసింది. కేసును పరిశీలించిన మద్రాస్ హైకోర్టు విశాల్కు, డైరెక్టర్ ఆనందన్కు నోటీసులను జారీ చేసింది. […]
టేలికాం రంగంలో మరోకసారి సమరశంఖం పూరించిన జియో
రిలయన్స్ జియో.. దేశీయ టెలికాం రంగంలో మరోసారి సమర శంఖం పూరించింది. తాజాగా పోస్ట్పెయిడ్ సెగ్మెంట్లోనూ ఆధిపత్యం కోసం చార్జీల యుద్ధానికి తెరలేపింది. ‘జియో పోస్ట్పెయిడ్ ప్లస్’ పేరుతో సరికొత్త ప్లాన్లను ఆవిష్కరించింది. ప్లాన్ను బట్టి రూ.399 నుంచి రూ.1,499 వరకు నెలవారీ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రముఖ ఓటీటీల వీడియో స్ట్రీమింగ్ వినోదం, ఉచిత అంతర్జాతీయ రోమింగ్, తొలిసారిగా ఇన్ ఫ్లైట్ కనెక్టివిటీ, డేటా రోల్ఓవర్, వైఫై కాలింగ్ తదితర ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ప్లాన్లను […]